మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం

మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం

సూర్యాపేట, వెలుగు: మైనింగ్, కార్మిక శాఖల మంత్రిగా నియమితులైన గడ్డం వివేక్ వెంకటస్వామిని మాల మహానాడు జేఏసీ సూర్యాపేట జిల్లా కన్వీనర్ వీర్జాల వేణు బలరాం ఆధ్వర్యంలో శుక్రవారం  హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ వీర్జాల వేణు బలరాం మాట్లాడుతూ..  మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు.

 కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్లు కట్టా సైదులు, కట్ట మురళి, బోయిల్ల అఖిల్, బోల్లెద్దు వినయ్, బొప్పని అనిల్, మద్దూరి కుమార్, తుంగతుర్తి కన్వీనర్ చింతపల్లి శేఖర్, జాన్ వెస్లీ, సూర్యాపేట పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా అధ్యక్షులు జంగం కర్ణాకర్, నాగంటి జోసెఫ్, జిల్లా మహిళా కన్వీనర్ పిట్టల భాగ్యమ్మ, కో కన్వీనర్ బొప్పని కవిత, మేడి ఉమా తదితరులు పాల్గొన్నారు.