
- ఎమ్మెల్యే వేముల వీరేశం
నార్కట్పల్లి, నకిరేకల్,వెలుగు : రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నార్కట్పల్లి మండలం ఏపీలింగోటం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం జూవ్విగూడెం గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన 42 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.
ప్రతి పేదోడి సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. నకిరేకల్మండలం మండలాపురం గ్రామంలో 45 మంది లబ్ధిదారుకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి చరిత, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో ఉమేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూషయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు బండ సాగర్ రెడ్డి, సట్టు సత్తయ్య, వడ్డే భూపాల్ రెడ్డి, గడ్డం పశుపతి, బైరెడ్డి రాంగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.