చిన్నారి ఆపరేషన్​కు ఎంపీ అర్వింద్ రూ.2లక్షల సాయం

చిన్నారి ఆపరేషన్​కు ఎంపీ అర్వింద్ రూ.2లక్షల సాయం

జగిత్యాల/నిజామాబాద్, వెలుగు: జగిత్యాలకు చెందిన అబ్దుల్ హమీద్​ ఏడేళ్ల కూతురు జూబీయా లివర్ సమస్యతో బాధపడుతోంది. లివర్ ​ట్రాన్స్​ప్లాంటేషన్​కు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో పాప తల్లిదండ్రులు నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ను కలిశారు. ఎంపీ తన ఫౌండేషన్​ తరఫున రూ.2 లక్షల సాయం చేశారు. ఎంపీతోపాటు కొన్ని సంస్థలు సాయం చేయడంతో రూ.20 లక్షలు సమకూరాయి. దాంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో పాపకు లివర్ ​ట్రాన్స్​ప్లాంటేషన్​ జరిగింది. పాపను ఎంపీ అర్వింద్​ శుక్రవారం కలిశారు. డాక్టర్లతో మాట్లాడారు. తమ ఫౌండేషన్​ ద్వారా ఇప్పటివరకు 153 మంది చిన్నారుల వైద్యానికి సాయం చేసినట్లు ఎంపీ తెలిపారు.