కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా చిన్నపిల్లలైపోయారు. భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో ఇద్దరు స్నోబాల్స్ విసురుతూ సరదాగా ఆట పట్టించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో షేర్ చేయగా ఇది కాస్త వైరల్ గా మారింది. రాహుల్ దొంగచాటుగా స్నోబాల్స్ తీసుకొని ప్రియాంక తలపై వేశారు. ప్రియాంక కూడా అలాగే చేసింది. అనంతరం ఇద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పక్కనే ఉన్న మరికొందరిపై కూడా రాహుల్ ఈ స్నోబాల్స్ విసిరారు. భారత్ జోడో యాత్ర చివరి విడతలో తన సోదరుడితో కలిసి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు.