జేఎల్ఎం, ఏఈ ఎగ్జామ్స్​వాయిదా వేయండి: ఆర్‌‌‌‌ఎస్పీ

జేఎల్ఎం, ఏఈ ఎగ్జామ్స్​వాయిదా వేయండి: ఆర్‌‌‌‌ఎస్పీ

హైదరాబాద్​, వెలుగు: ఈ నెల 30న పీసీ, కమ్యూనికేషన్స్ పీసీ, జేఎల్ఎం, ఏఈ పరీక్షలు ఉన్నాయని.. నిరుద్యోగులు ఒకేరోజు 4 పరీక్షలు ఎలా రాస్తారని సీఎం కేసీఆర్‌‌‌‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. టీఎస్​ఎస్పీడీసీఎల్​ పరిధిలోని జేఎల్ఎం, ఏఈ పరీక్షలను ఒక వారమైనా వాయిదా వేయాలని శుక్రవారం ఆయన ట్విట్టర్‌‌‌‌లో డిమాండ్ చేశారు. ‘వేలాది మంది నిరుద్యోగులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నా.. మీకు చీమ కుట్టినట్టుగా కూడా లేదా’ అని ​నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వనందునే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.  కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ ​అనే హ్యష్ ట్యాగ్​ను ఆయన​ ట్వీట్​కు జత చేశారు.