ఆర్టీసీ బస్సు-బైకు ఢీ..ఇద్దరు సోదరుల మృతి

ఆర్టీసీ బస్సు-బైకు ఢీ..ఇద్దరు సోదరుల మృతి

హన్మకొండ జిల్లా: ఆర్టీసీ బస్సు బైకు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఐనవోలు మండలం ఉడతగూడెం సమీపంలో జరిగిందీ ప్రమాదం. మృతులు ఏలీయా (41),కుమార్ (36) సోదరులుగా గుర్తించారు. వీరి స్వగ్రామం ఉడతగూడెం. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  గ్రామంలో విషాదం ఏర్పడింది.