అమ్మాయిల వైపు చూడాలంటేనే భయపడాలి 

అమ్మాయిల వైపు చూడాలంటేనే భయపడాలి 


మిర్యాల​గూడ, వెలుగు : పోకిరీలు అమ్మాయిల వైపు చూడాలంటేనే భయపడేలా షీటీం పోలీసులు పనిచేయాలని డీఐజీ ఏవీ.రంగనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. బుధవారం అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్పీ నర్మదతో కలిసి మిర్యాలగూడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, యువతులను వేధించే వారిపై సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోనున్నట్లు ప్రకటించారు. షీటీంకు అందిన ఫిర్యాదుల వివరాలను రహస్యంగా ఉంచుతామని చెప్పారు. షీటీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పోస్టర్లలోని క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే ఫిర్యాదు నమోదు అవుతుందన్నారు. అనంతరం షీటీంకు సంబంధించిన క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించి, మొక్కలు నాటారు. సమావేశంలో డీఎస్పీ వై. వెంకటేశ్వరరావు, సీఐలు సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సత్యనారాయణ, షీటీం ఎస్సై మాధురిరెడ్డి, ట్రాఫిక్​ఎస్సై సర్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.