
ఎల్బీనగర్: మీర్ పేట పరిధిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి నీటి సంపులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలోని సాయిప్రభు హోమ్స్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు(59) అబిడ్స్ ప్రాంతంలోని రాష్ట్ర ప్రభుత్వ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్లో ఆడిటర్ గా పని చేస్తున్నాడు.
ఆదివారం ఉదయం నీటిసంపులో ఆయన ఉన్నట్టుండి శవమై కనిపించాడు. తన అమ్మ, అన్నయ్యకు ఆర్థిక సమస్యలున్నాయని, ఈ సమయంలో తన తండ్రి చనిపోవడంపై పలు అనుమానాలు తావిస్తోందని వెంకటేశ్వరరావు కూమార్తె ఆరోపించారు. ఇదే విషయమై మీర్పేట పీఎస్లో ఆమె ఫిర్యాదుతో చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.