మీర్ పేటలో అనుమానాస్పద స్థితిలో ప్రభుత్వ ఉద్యోగి..

మీర్ పేటలో  అనుమానాస్పద స్థితిలో  ప్రభుత్వ ఉద్యోగి..

ఎల్బీనగర్: మీర్ పేట పరిధిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి నీటి సంపులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా బడంగ్​పేటలోని సాయిప్రభు హోమ్స్ కాలనీలో నివాసం ఉంటున్న  వెంకటేశ్వరరావు(59) అబిడ్స్ ప్రాంతంలోని  రాష్ట్ర ప్రభుత్వ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్​లో ఆడిటర్ గా పని చేస్తున్నాడు. 

ఆదివారం ఉదయం నీటిసంపులో ఆయన ఉన్నట్టుండి శవమై కనిపించాడు. తన అమ్మ, అన్నయ్యకు ఆర్థిక సమస్యలున్నాయని, ఈ సమయంలో తన తండ్రి చనిపోవడంపై పలు అనుమానాలు తావిస్తోందని వెంకటేశ్వరరావు కూమార్తె ఆరోపించారు. ఇదే విషయమై మీర్​పేట పీఎస్​లో ఆమె ఫిర్యాదుతో చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.