
- బనకచర్లతో తెలంగాణకు ఎట్ల నష్టమో చెప్పట్లే: ఎంపీ అర్వింద్
హైదరాబాద్, వెలుగు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం బీఆర్ఎస్, సగం కాంగ్రెస్ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ నిర్వహించిన అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ మీటింగ్ అని ఆరోపించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బనకచర్లకు ఆమోదం తెలిపారని కేసీఆర్, జగన్ భేటీ అయినప్పుడు దీని గురించి మాట్లాడుకున్నారని ఆయన గుర్తుచేశారు.
అయితే, బనకచర్లతో తెలంగాణకు ఎలా నష్టం జరుగుతుందనే ప్రశ్నకు ఉత్తమ్ వద్ద సమాధానం లేదన్నారు. ఎన్ని టీఎంసీలు అనే వివరాలు లేవని, ప్రాజెక్టు ఎలా కడతారనే దానిపైనా ఆయనకు అవగాహన లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును కట్టకుండా ఎవరూ అడ్డుకోవడం లేదని, ఈ ప్రభుత్వానికి 'నాలెడ్జ్' లేదని విమర్శించారు.