మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీగా ట్రాన్స్జెండర్లు

మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీగా ట్రాన్స్జెండర్లు
  • 20 మందికి ఉద్యోగాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
  • అపాయింట్​మెంట్​ లెటర్లు అందజేసిన మంత్రి అడ్లూరి 
  • ట్రాన్స్​జెండర్ల భవిష్యత్తుకు ప్రభుత్వం అండ: మంత్రి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ట్రాన్స్​జెండర్ల కోసం రాష్ట్ర ప్రభు త్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ట్రాఫిక్​ నియంత్రణలో పలువురు ట్రాన్స్​జెండర్లకు ఉద్యోగాలు ఇవ్వగా.. ఇప్పుడు హైదరాబాద్​ మెట్రో రైల్వే స్టేష న్లలోనూ సెక్యూరిటీ గార్డులుగా 20 మంది ట్రాన్స్​జెం డర్లకు అవకాశం కల్పించింది. వీరికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం అపాయింట్​మెంట్​ లెటర్లు అందించారు. సెక్రటేరియెట్​లోని మంత్రి చాంబర్​లో ఈ కార్యక్రమం జరిగింది. 

ఉద్యోగాలు పొందిన ట్రాన్స్‌‌‌‌జెండర్లకు దీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ తరఫున యూనిఫామ్‌‌‌‌లను స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లా డుతూ.. ‘‘ట్రాన్స్‌‌‌‌జెండర్లు ఎందులోనూ తక్కువకాదని, తలెత్తుకొని బతికేవాళ్లని సమాజానికి నిరూపించే దిశగా ప్రభుత్వం గౌరవప్రదమైన అవకాశాలను కల్పిస్తున్నది” అని తెలిపారు. ఇప్పటివరకు ట్రాఫిక్ నియంత్రణలో అవకాశాలు కల్పించగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌‌‌‌లో 20 మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించడం సీఎం రేవంత్​రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

 సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 నుంచి 400 మం ది దరఖాస్తు చేసుకోగా.. నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ట్రాన్స్‌‌‌‌జెండర్ల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ట్రాన్స్​జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలనేది సీఎం రేవంత్​ సంకల్పమన్నారు. ‘‘మీరు(ట్రాన్స్​జెండర్లు) సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించాం. కష్టపడి పనిచేస్తే మీకే కాకుండా, మీతో పాటు బతికేవారికి కూడా తలెత్తుకొని జీవించేందుకు మార్గం ఏర్పడుతుంది. మీరు ఈ సమాజానికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలి’’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ సూచించారు. 

ప్రైవేట్​, పబ్లిక్​ రంగాల్లో మరిన్ని అవకాశాలు: అనితా రామచంద్రన్​

“ఒక చిన్న అడుగుతో గొప్ప మార్పు సాధ్యం అవు తుంది. మీరు నిజాయతీగా పనిచేస్తే ఆ గుర్తింపు మీకే వస్తుంది” అని ఉద్యోగాలు పొందిన ట్రాన్స్​జెండర్ల కు మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్  సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే ట్రాన్స్​జెండర్లకు ఆస్పత్రుల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ గదులు, మైత్రి క్లినిక్‌‌‌‌ల ద్వారా మానసిక సహాయం, గుర్తింపు కార్డులు, స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్, బ్యాంకు లింకేజీ లేకుండా ఆర్థిక సహాయం వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నదని వివరించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు ట్రాన్స్‌‌‌‌జెండర్ల సేవల వైపు ఆసక్తి చూపుతున్నాయని, ఇప్పుడు చేపట్టిన నియామకాలు ప్రైవేట్, పబ్లిక్ రంగాలపై ప్రభావం చూపి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు దోహదపడతాయని అనితా రామచంద్రన్​ అన్నారు. 

ఇది ఆత్మగౌరవం: ట్రాన్స్​జెండర్లు

తమను ‘బాధితులు’ అన్న ముద్ర నుంచి ఈ ఉద్యోగాలు ‘భాగస్వాములు’ అనే గౌరవప్రదమైన స్థాయికి తీసుకెళ్తున్నాయని ఉద్యోగాలు పొందిన ట్రాన్స్​జెండర్లు అన్నారు. ‘‘ఇది ఉద్యోగం మాత్రమే కాదు.. ఆత్మగౌరవం. మా జీవితాలను నిలబెట్టే విప్లవాత్మక అడుగు” అని ఆనందం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో డిజేబుల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ శైలజ, ఎస్‌‌‌‌ఐఎస్ ఇండియా లిమిటెడ్ నిర్వాహకులు గిరీశ్​ పాండే, దీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ముకుంద మాల, మౌంట్ ఫాంట్ సోషల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్ డైరెక్టర్ వర్గీస్ తెక్కనాథ్, ట్రాన్స్ వెల్ఫేర్ ఫౌండర్ వాసవి తదితరులు పాల్గొన్నారు.