గగన్​పహాడ్​లో 2.7 కిలోల గంజాయి పట్టివేత

గగన్​పహాడ్​లో 2.7 కిలోల గంజాయి పట్టివేత

గండిపేట, వెలుగు: గంజాయి సప్లయ్ చేస్తున్న ముగ్గురిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పర్​పల్లిలోని శంషాబాద్ ఎక్సైజ్ పీఎస్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి వివరాలు వెల్లడించారు. 

ఉత్తర ప్రదేశ్​కు చెందిన అజయ్ పటేల్ గగన్ పహాడ్ వద్ద బైక్ పై గంజాయిని తీసుకెళ్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి దగ్గరి నుంచి 2.7 కిలోల గంజాయితో పాటు బైక్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అజయ్ పటేల్ కు సహకరించిన అనిల్ కుమార్, ఖలీల్​ను సైతం అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించామన్నారు.