తిలక్‌‌‌‌ జోరు.. ఆసియా గేమ్స్‌‌‌‌ ఫైనల్లో ఇండియా

తిలక్‌‌‌‌ జోరు..   ఆసియా గేమ్స్‌‌‌‌ ఫైనల్లో ఇండియా

హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌‌‌‌లో ఇండియా క్రికెట్‌‌‌‌ టీమ్‌‌‌‌ మెడల్‌‌‌‌ కన్ఫామ్‌‌‌‌ చేసుకుంది. టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో తెలుగు బ్యాటర్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మ (26 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌లతో 55 నాటౌట్‌‌‌‌), రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌ (26 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 40 నాటౌట్‌‌‌‌) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన సెమీస్‌‌‌‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌‌‌ ఓడిన బంగ్లా 20 ఓవర్లలో 96/9 స్కోరు చేసింది. 

జాకీర్‌‌‌‌ అలీ (24 నాటౌట్‌‌‌‌) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. పర్వేజ్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ (23), రకీబుల్‌‌‌‌ హసన్‌‌‌‌ (14)తో సహా అందరూ ఫెయిలయ్యారు. ఇండియా బౌలర్లలో సాయి కిశోర్‌‌‌‌ 3, సుందర్‌‌‌‌ 2 వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 9.2 ఓవర్లలో 97/1 స్కోరు చేసి నెగ్గింది. యశస్వి జైస్వాల్‌‌‌‌ (0) డకౌటైనా, తిలక్‌‌‌‌, రుతురాజ్‌‌‌‌ ఈజీగా గెలిపించారు.