
న్యూఢిల్లీ: మన దేశంలో విహారయాత్రకు వచ్చిన ఇద్దరు లండన్ వాసులు విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో ఉన్నారు. జేమీ మీక్, ఫియోన్ గల్ గ్రీన్ లా మీక్ ఇటీవలే గుజరాత్ లో పర్యటించారు. వివిధ చారిత్రక ప్రదేశాలు తిరిగారు. తమ టూర్ లో ఎన్నో అద్భుతమైన అనుభవాలు సొంతం అయ్యాయని ఇద్దరూ ఇన్ స్టాగ్రాంలో తెలిపారు. గురువారం తాము తిరిగి తమ దేశానికి వెళుతున్నామని, బుధవారమే తమకు ఇండియాలో చివరి రోజు అని చెప్పారు.
‘‘భారత్ ను వీడుతున్నందుకు బాధగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మాకు ఎన్నో మ్యాజికల్ ఎక్స్ పీరియెన్సెస్ దక్కాయి. త్వరలోనే మా టూర్ పై వ్లాగ్ చేస్తం. గుడ్ బై ఇండియా” అంటూ ఇద్దరూ ఓ వీడియో విడుదల చేశారు. అంతలోనే ఇద్దరూ ఫ్లైట్ క్రాష్ లో ప్రాణాలు కోల్పోయారు. జేమీ, ఫియోన్ గల్ తమ టూర్ కు సంబంధించి ఇన్ స్టాలో స్టోరీలు కూడా షేర్ చేశారు.