హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చి బీజేపీకి నష్టం చేయడానికే రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులు పాదయాత్రలు, దండ యాత్రలు చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టు కోసం బీఆర్ఎస్ ఆరాటాన్ని, తెలంగాణలో బలపడడం కోసం తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం ఆమె ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. సంజయ్ పాదయాత్రలతో జనంలోకి బీజేపీ బలంగా వెళ్లిందన్నారు.