ఆస్తి కోసం భర్త అంత్యక్రియలు ఆపేసి భార్యల గొడవ

ఆస్తి కోసం భర్త  అంత్యక్రియలు ఆపేసి భార్యల గొడవ

కోరుట్ల, వెలుగు: చనిపోయిన భర్తకు అంత్యక్రియలు చేయకుండా అతని అస్తి కోసం ఇద్దరు భార్యలు గొడవపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. అయిలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మామిడాల నర్సింహులు(52) ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ట్రీట్మెంట్ పొందుతూ బుధవారం చనిపోయారు. ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య పేరిట ఉన్న ఆస్తిలో కొంత భాగం తన పేరు మీద రాసే వరకు అంత్యక్రియలు జరపడానికి వీల్లేదని రెండో భార్య మొండికేసింది. దీంతో ఇద్దరు భార్యలు మృతదేహన్ని ఇంటివద్ద వదిలేసి కథలాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ అయ్యాక గురువారం మధ్యాహ్నం కోరుట్లకు వచ్చి అంత్యక్రియలు జరిపారు.