యాదగిరిగుట్టలో ఫిర్యాదు బాక్సులు

యాదగిరిగుట్టలో ఫిర్యాదు బాక్సులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నెలకొన్న సమస్యలపై భక్తుల నుంచి నేరుగా సలహాలు, సూచనలు స్వీకరించడం కోసం కొండపైన 'ఫిర్యాదు బాక్సులు' ఏర్పాటు చేశారు. ఈ బాక్కులను శనివారం ఆలయ ఈవో, ఐఏఎస్ అధికారి వెంకటరావు పరిశీలించారు. కొండపైన ప్రధాన కార్యాలయం, పీఆర్వో ఆఫీస్ ఎదుట, డోనర్ సెల్, క్యూకాంప్లెక్స్ ముందు, ప్రసాద విక్రయ కేంద్రంతోపాటు కొండ కింద తులసీ కాటేజీలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులను ఆయన పరిశీలించారు. 

ఆలయ మాడవీధులు, క్యూలైన్లను పరిశీలించిన ఈవో.. క్యూలైన్లలో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రదేశాల్లో కూల్ వాటర్, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్శంగా ఈవో మాట్లాడుతూ ఇకపై భక్తులకు ప్రతిరోజు కూల్ వాటర్, మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు. బాక్సుల్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపట్టి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.