తుఫానులో 10 చైనా షిప్‌లు.. రక్షణ కల్పించిన ఇండియన్ నేవీ

తుఫానులో 10 చైనా షిప్‌లు.. రక్షణ కల్పించిన ఇండియన్ నేవీ

చైనా దేశానికి చెందిన పది భారీ వెసెల్స్ కు భారత కోస్ట్ గార్డ్ రక్షణ కల్పించాయి. వాయి సైక్లోన్ ప్రభావంతో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. చైనాకు చెందిన పది భారీ షిప్ లు తమకు రక్షణ కావాలని భారత నావికా దళాలను కోరాయి.

మానవీయ కోణంలో ఆలోచించి చైనా 10 వెసెల్స్ కు రక్షణ కల్పించామని ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇన్ స్పెక్టర్ జనరల్ కేఆర్ సురేష్ చెప్పారు. తుఫానులో ఆ పడవలు చిక్కుకోకుండా మహారాష్ట్రలోని రత్నగిరి పోర్టుల ో షెల్టర్ ఇచ్చామని చెప్పారు. అక్కడ భద్రత కల్పించామని చెప్పారు.