
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ఈ నెల 20, 21 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. రామచంద్రపురం-– ఫలక్నుమా, ఫలక్నుమా-– సికింద్రాబాద్, సికింద్రాబాద్– ఫలక్నుమా, సికింద్రాబాద్– మేడ్చల్, హైదరాబాద్– లింగంపల్లి, ఫలక్నుమా-– రామచంద్రపురం, లింగంపల్లి– -ఫలక్నుమా స్టేషన్ల మధ్య నడిచే 11 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని కోరారు.