హిమాచల్ ప్రదేశ్ లో బస్సుపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. మరో 14 మంది గాయపడ్డారు. ఇంకా 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కొండచరియల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కిన్నౌర్ జిల్లా రెకాంగ్ పియో మరియు సిమ్లా హైవేపై బుధవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖకు చెందిన ఓ బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నాయి. బస్సులో 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ITBP, NDRF సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. కేంద్రం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు.
Shocked by the another tragic incident at Kinnaur, Himachal Pradesh. 13 dead, around 60 others feared trapped under debris after several vehicles were hit by a landslide.
— Srinivas B V (@srinivasiyc) August 12, 2021
I offer my condolences to their families. Requesting @IYCHimachal workers to provide all possible assistance pic.twitter.com/cKsiJAu2i4