కాలేజీలో కరోనా కలకలం

కాలేజీలో కరోనా కలకలం

రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఓ కాలేజీలో విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. 14 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. నార్సింగి లోని ఓ కళాశాలలో 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా తోటి విద్యార్థులంతా భయబ్రాంతులకు గురయ్యారు. గత రెండు రోజులుగా తీవ్ర చలి, జ్వరంతో విద్యార్థులు బాధపడుతున్నారు. దీంతో ఇవాళ ఉదయం విద్యార్దులకు కళాశాల యాజమాన్యం వైద్య పరీక్షలు చేయించారు. ఈ టెస్టుల్లో14 మంది విద్యార్దులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన నార్సింగి  మునిసిపల్ అధికారులు వెంటనే కాలేజీ వద్దకు చేరుకొని శానిటైజ్ చేశారు. మిగతా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారిని కూడా క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.