త‌ల్లి సెల్ ఫోన్ ఇవ్వ‌లేద‌ని..14ఏళ్ల బాలుడి ఆత్మ‌హ‌త్య

త‌ల్లి సెల్ ఫోన్ ఇవ్వ‌లేద‌ని..14ఏళ్ల బాలుడి ఆత్మ‌హ‌త్య

తిరుమ‌ల గిరిలో విషాదం చోటు చేసుకుంది. త‌ల్లి త‌న‌కు ఫోన్ ఇవ్వ‌లేదంటూ 14ఏళ్ల బాలుడు ఆత్మ‌హత్య చేసుకున్నాడు. తిరుమ‌ల గిరి వెంక‌ట్వేశ‌ర కాల‌నీకి చెందిన సంజ‌య్ ప్ర‌కాష్ , అనితా దేవిలకు ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు, ఒక కుమారుడు ఆయుష్ కుమ‌ర్ (14). తండ్రి సంజ‌య్ ఆర్మీ సుబేదార్ గా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ప‌నిచేస్తున్నాడు. త‌ల్లి అనితా పిల్ల‌ల‌తో తిరుమ‌ల గిరిలో నివాసం ఉంటున్నారు.
అయితే కేంద్ర‌విద్యాల‌యంలో తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఆయ‌ష్ ఇంట్లో ఉంటే ఆన్ లైన్ క్లాసుల‌కు అటెండ్ అవుతున్నాడు. ఈ క్ర‌మంలో త‌న‌కు ఫోన్ కావాలంటూ త‌ల్లి అనిత‌ను కోరాడు. దీంతో ఫోన్ ఇచ్చేందుకు త‌ల్లి తిర‌స్క‌రించ‌డంతో మ‌న‌స్థాపానికి గురైన ఆయుష్ కుమార్ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే బాలుడు బెడ్ రూమ్ నుంచి ఎంత‌కీ బ‌య‌ట‌కు రావ‌డంతో అనుమానం వ‌చ్చిన కుటుంబ‌స‌భ్యులు ఇరుగుపొరుగువారి సాయంతో ఇంటి డోర్ ను బ‌ల‌వంతంగా ఓపెన్ చేసి చూడ‌గా..ఆయుష్ ఉరికి వేలాడుతూ విగ‌త‌జీవిగా క‌నిపించాడు. దీంతో కొడుకు ఆత్మ‌హ‌త్య‌ను త‌ట్టుకోలేని త‌ల్లి గుండెల‌విసేలా క‌న్నీరుమున్నీరుగా విల‌పించింది. బాలుడి మృతిపై స‌మాచారం అందుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.