గ్రేటర్లో రూ.14.39 లక్షలు పట్టివేత

గ్రేటర్లో రూ.14.39 లక్షలు పట్టివేత

హైదరాబాద్/వికారాబాద్/ముషీరాబాద్, వెలుగు :  లోక్ సభ ఎన్నికల కోడ్​నేపథ్యంలో గ్రేటర్​తోపాటు శివారు జిల్లాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం తాండూరులో నిర్వహించిన వెహికల్స్​చెకింగ్​లో రూ.9లక్షల39 వేల నగదు పట్టుబడింది. స్థానిక మల్​రెడ్డిపల్లికి చెందిన జెట్టూరు బస్వరాజ్​తన వెహికల్​లో రూ.9లక్షల 39 వేలు తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశారు. 

హిమాయత్ నగర్ వైజంక్షన్ వద్ద శనివారం రాత్రి నిర్వహించిన వెహికల్స్​తనిఖీల్లో రూ.5లక్షలు పట్టుకున్నట్లు దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బర్కత్​పురాకు చెందిన విజయభాస్కర్ బైక్​పై వెళ్తుండగా ఆపి తనిఖీ చేయగా రూ.5 లక్షలు దొరికిందని, సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశామన్నారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు రూ. 2కోట్ల86లక్షల98వేల700 సీజ్ చేసినట్లు కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.