హైదరాబాద్/వికారాబాద్/ముషీరాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల కోడ్నేపథ్యంలో గ్రేటర్తోపాటు శివారు జిల్లాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం తాండూరులో నిర్వహించిన వెహికల్స్చెకింగ్లో రూ.9లక్షల39 వేల నగదు పట్టుబడింది. స్థానిక మల్రెడ్డిపల్లికి చెందిన జెట్టూరు బస్వరాజ్తన వెహికల్లో రూ.9లక్షల 39 వేలు తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశారు.
హిమాయత్ నగర్ వైజంక్షన్ వద్ద శనివారం రాత్రి నిర్వహించిన వెహికల్స్తనిఖీల్లో రూ.5లక్షలు పట్టుకున్నట్లు దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బర్కత్పురాకు చెందిన విజయభాస్కర్ బైక్పై వెళ్తుండగా ఆపి తనిఖీ చేయగా రూ.5 లక్షలు దొరికిందని, సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశామన్నారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు రూ. 2కోట్ల86లక్షల98వేల700 సీజ్ చేసినట్లు కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.