గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో కరోన కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 15 మంది విద్యార్థులకు కరోన పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఏప్రిల్ 6వ తేదీ గురువారం కొందరు విద్యార్థులకు జ్వరం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో విద్యర్ధులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు. స్కూల్ లో ఉన్న మొత్తం విద్యార్థుల్లో 15 మందికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు.

దీంతో విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే విషయం తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. తమ పిల్లలను ఇంటికి తీసుకవేళ్ళడానికి పాఠశాల వద్దకు చేరుకున్నారు తల్లిదండ్రులు.