గచ్చిబౌలి, వెలుగు: కొండాపూర్లో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. సిరిసిల్లకు చెందిన కుర్ర క్రిష్ణ భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి కొండాపూర్ ఆనంద్నగర్కాలనీలో నివాసముంటూ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో క్రిష్ణ తన భార్యతో కలిసి గ్రామానికి వెళ్లి ఓటు వేసి అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకున్నారు.
ఇంటికి వచ్చే సరికి తొమ్మిదో తరగతి చదువుతున్న వీరి పెద్ద కొడుకు శ్యామ్చరణ్(15) ఇంట్లో లేడు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి వెళ్లే ముందు శ్యామ్ తల్లి ఫోన్ ఎక్కువగా ఎందుకు చూస్తున్నావని మందిలించింది.
