కొండాపూర్ లో బాలుడు మిస్సింగ్

కొండాపూర్ లో బాలుడు మిస్సింగ్

గచ్చిబౌలి, వెలుగు: కొండాపూర్​లో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. సిరిసిల్లకు చెందిన కుర్ర క్రిష్ణ భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి కొండాపూర్​ ఆనంద్​నగర్​కాలనీలో నివాసముంటూ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న స్వగ్రామంలో సర్పంచ్​ ఎన్నికలు ఉండడంతో క్రిష్ణ తన భార్యతో కలిసి గ్రామానికి వెళ్లి ఓటు వేసి అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకున్నారు. 

ఇంటికి వచ్చే సరికి తొమ్మిదో తరగతి చదువుతున్న వీరి పెద్ద కొడుకు శ్యామ్​చరణ్​(15) ఇంట్లో లేడు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి వెళ్లే ముందు శ్యామ్​ తల్లి ఫోన్​ ఎక్కువగా ఎందుకు చూస్తున్నావని మందిలించింది.