
కరోనా ఉన్నట్టు అనుమానిస్తున్న 167 మంది పంజాబ్ లోని లూధియానాలో కనిపించకుండా పోయారు. కరోనా ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చిన వాళ్లతో కాంటాక్ట్ అయినోళ్లను ట్రాక్ చేస్తున్న అధికారులకు వారి జాడ తెలియరాలేదు. మరో 29 మంది ఆచూకీని మాత్రం కనుగొన్నారు. విదేశాల నుంచి వచ్చినోళ్లు, వాళ్లను కలిసి నోళ్ల లిస్టును రాష్ట్రంలోని మెడికల్ అధికారులందరికీ ప్రభుత్వం పంపించింది. వాళ్లను పట్టుకునేందుకు రెండు టీంలను ఏర్పాటు చేశామని లూధియానా సివిల్ సర్జన్ తెలిపారు. కరోనా లాక్డౌన్తో ప్రజలకు ఒకేసారి మూడు నెలల రేషన్ సరుకులు ఇచ్చేలా ఒడిశా సర్కార్ ఏర్పాట్లు చేసింది.