రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1673 కేసులు..ఒకరు మృతి

రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1673 కేసులు..ఒకరు మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. కొత్తగా వస్తున్న కేసులన్నీ హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే నమోదు అవుతుండడం గమనార్హం. గడచిన 24 గంటల్లో 1673 కొత్త కేసులు నమోదు కాగా.. కరోనా బారిన పడి కోలుకోలేక ఒకరు మృతి చెందారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1165 కేసులు , మేడ్చల్ పరిధిలో 149 కేసులు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 23 కేసులు నమోదయ్యాయి.
కరోనా సోకిన వారిలో 330 మందిక ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారని, మొత్తం 97.46శాతం మంది రికవరీ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.  రాష్ట్రంలో 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ లో ప్రకటించింది.

 

 

ఇవి కూడా చదవండి

 

మహిళలతో కలసి కోలాటం ఆడిన మంత్రి

ధనిక రాష్ట్రంలో 9వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవు

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి చూస్తుంటే కంట్లో నీళ్లొస్తున్నాయి