డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి చూస్తుంటే కంట్లో నీళ్లొస్తున్నాయి

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి చూస్తుంటే కంట్లో నీళ్లొస్తున్నాయి
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల పరిస్థితి చూస్తే.. కళ్లలోంచి నీళ్లు వస్తున్నాయని ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్  అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంలో కనీసం నాణ్యత లేదన్నారు. వంద ఇళ్ల నిర్మాణం ఆరేళ్లుగా పెండింగ్ లో పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఇళ్లు నిర్మించడం చేతకాక పోతే ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

 

 

 

ఇవి కూడా చదవండి