
సికింద్రాబాద్, వెలుగు : తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 256 దేవాలయాలకు మంజూరైన రూ.1.69 కోట్ల బోనాల చెక్కులను పంపిణీ చేశారు.
ఆలయాల కమిటీ సభ్యులు చెక్కులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, కార్పొరేటర్లు టి.మహేశ్వరి, కొంతం దీపిక, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.