ఈజిప్ట్ షిప్పులో 17 మంది ఇండియన్ టూరిస్టులు బందీ

ఈజిప్ట్ షిప్పులో 17 మంది ఇండియన్ టూరిస్టులు బందీ

తమిళులు ఈజిప్ట్​లో చిక్కుబడిపోయారు. లగ్జర్ సిటీకి సమీపంలోని నైలు నదీ తీరంలో వాళ్లు ప్రయాణిస్తున్న షిప్పును అక్కడి అధికారులు ఆపేశారు. తమిళనాడుకు చెందిన 17 మంది చిక్కుకున్నారు. ఇప్పటికే ఆ షిప్పులో ఉన్న 12 మంది సిబ్బందితో పాటు 33 మంది ప్యాసింజర్లకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని శనివారం అలెగ్జాండ్రియాలోని హాస్పిటల్ కు తరలించారు. టూర్ లో భాగంగా సేలంకు చెందిన గ్రాండ్ రాయల్ టూర్స్​కు చెందిన షిప్పులో ఫిబ్రవరి 27న బయల్దేరినట్టు తమిళనాడుకు చెందిన వనిత అనే మహిళ తెలిపింది. మార్చి 7న తిరిగి ఇండియాకు రావాల్సి ఉండగా, కొవిడ్ నేపథ్యంలో ఈజిప్ట్​లో క్వారెంటైన్  చేశారని చెప్పింది. షిప్పులో టైంకు తిండి పెట్టట్లేదని, ఈజిప్ట్​లోని ఇండియన్ ఎంబసీకి ఇప్పటికే సమాచారమిచ్చామని తెలిపింది. శాకాహారం ఇవ్వాల్సిందిగా షిప్ క్రూను కోరినట్టు చెప్పింది. స్టెరిలైజేషన్ కోసం షిప్పులోని కిచెన్ ను మూసేశారని, బయటి నుంచి ఫుడ్డు తెస్తున్నారని ఆవేదన చెందింది.