కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్​ టన్నుల వడ్ల కొనుగోలు

కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్​ టన్నుల వడ్ల కొనుగోలు

కామారెడ్డి ​, వెలుగు: జిల్లాలో ఇప్పటి వరకు రూ. 422 కోట్ల విలువైన 1,91,567 మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు కామారెడ్డి అడిషనల్​కలెక్టర్​చంద్రమోహన్​ తెలిపారు. సోమవారం ఆయన తాడ్వాయి మండలంలోని కృష్ణాజీవాడి, సంతాయిపేట, బ్రహ్మణ్​పల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లను పరిశీలించారు.  అనంతరం కలెక్టరేట్‌లో రైసుమిల్లర్లతో మీటింగ్ నిర్వహించారు. చంద్రమోహన్​మాట్లాడుతూ..  కాంట పెట్టిన వెంటనే ఆన్​లైన్లో ఏంట్రీ చేయాలన్నారు. ట్యాబ్​లో ఎంట్రీ అయిన వెంటనే రైతుల అకౌంట్‌లో పైసలు జమ చేస్తున్నామన్నారు. కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన వడ్లను మిల్లుల్లో ఉన్న కెపాసిటీ మేరకు ఆన్​లోడ్​ చేసుకోవాలని సూచించారు.  అకాల వర్షాలు వచ్చే సూచనలు ఉన్నందున మిల్లులకు వచ్చిన వడ్లను డిలే చేయకుండా ఆన్​లోడ్​ చేసుకోవాలన్నారు.  డీఎస్​వో మల్లిఖార్జునబాబు, డీఎం నిత్యానందం,  తదితరులు  పాల్గొన్నారు.