కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్​ఎస్​ నేత కేసీఆర్​, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్​రెడ్డి.కేసీఆర్​ కు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి దత్తపుత్రుడు ..కిషన్​ రెడ్డి కల్వకుంట్ల కిషన్​ రావుగా మారారని  అన్నారు. దత్తపుత్రుడు కిషన్​ రెడ్డి, దొంగ పుత్రుడు కేటీఆర్​ కలిసి కేసీఆర్​ ను కాపాడుతున్నారుని ఆరోపించారు. కాళేశ్వరం కేసు సీబీఐ కి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్​ ను జైల్లో పెడతా మన్న  కిషన్​ రెడ్డి.. కాళేశ్వరం కేసును బీజేపీ ఎందుకు ముందుకు  సాగనీయడం లేదు.. సీబీఐ విచారణ చేయాలని  కోరినా ఇప్పుడు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్​, హరీష్​ రావును ఎప్పుడు అరెస్ట్​ చేస్తారో కిషన్​ రెడ్డి చెప్పాలన్నారు.

బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు దొందు దొందే ..నిజామాబాద్​ జిల్లాలో బీజేపీ, బీఆర్​ ఎస్​ లను గెలిపిస్తే అభివృద్ది శూన్యం అన్నారు. బీజేపీనుంచి ఇద్దరు కేంద్ర మంత్రులన్నా.. నిధులు తెచ్చింది  నిల్​ అన్నారు. నిజామాబాద్​ లో రెండుసార్లు బీఆర్​ ఎస్​ గెలిచినా మురికికూపం చేశారని విమర్శించారు సీఎం రేవంత్​ రెడ్డి. అర్వింద్​ ను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్​ ను స్మార్ట్​ సిటీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్​రెడ్డి. 

►ALSO READ | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 75 శాతం పైగా స్థానాలు గెలుస్తాం: మంత్రి దామోదర రాజ నర్సింహా..

నిజామాబాద్​ జిల్లా అభివృద్దే లక్ష్యంగా  కాంగ్రెస్​ పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్​ రెడ్డి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలవాలంటే కాంగ్రెస్​ ను గెలిపించుకోవాలన్నారు. అభివృద్దే లక్ష్యంగా నిజామాబాద్​ జిల్లాలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశాం.. ఒక కార్పొరేషన్​, ఏడు మున్సిపాలిటీలలోవెయ్యి కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నామన్నారు సీఎం రేంత్​ రెడ్డి.రూ.600కోట్లతో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్​నిర్మిస్తున్నామన్నారు. నిజామాబాద్​ జిల్లా అభివృద్ధికి 100 శాతం సహకరిస్తా..నిధులిచ్చే బాధ్యత నాది.. నిజామాబాద్​ ను అభివృద్ది చేసే బాధ్యత నాది అని సీఎం రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు.