ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ

ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ

ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుందని ఆరోపించారు  పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. శ్రీరాంపూర్ RK-7 లో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. సింగరేణి నష్టంలో ఉన్నప్పుడు వడ్డీలేని రుణాన్ని  తీసుకువచ్చి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి అని చెప్పారు.గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త బొగ్గుబావి  కూడా ఏర్పాటు చేయలేదని.. సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసే కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్ దని విమర్శించారు

సింగరేణలో కొత్త బొగ్గుబావులను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు వంశీ. సింగరేని కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తామన్నారు. కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని..ఎంపీగా అవకాశం కల్పిస్తే కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ నాయకులు అక్రమ దందాలు,ఇసుక దందాలు చేస్తూ ఉద్యోగాలు అమ్ముకున్నారని తెలిపారు .కాక స్ఫూర్తి తోనే పెద్దపల్లి పార్లమెంట్ లో ప్రజా సేవ చేసేందుకు  రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. సేవ చేసే నాయకులను..దోపిడీ చేసే నాయకులను ప్రజలు గుర్తించాలన్నారు. ప్రపంచంలోనే లేని సోలార్ రూఫ్ ప్రొడక్ట్ కనిపెట్టిన అమెరికా ప్రభుత్వం తనకు అవార్డు ఇచ్చిందన్నారు.

బీజేపీ  ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయలు అంబానీ అదానీలకు మాఫీ పంచంలోనే వారిని అత్యధిక ధనవంతులను చేసిందన్నారు వంశీ. బ్రిటిష్ వాళ్ళు అయితే ఎలా దోచుకున్నారో ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ  ప్రభుత్వం దేశాన్ని దోచుకుంటుందని ఆరోపించారు.