కొల్లాపూర్, వెలుగు : అధికారులు, మిల్లర్లు కుమ్మకై కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులో క్వింటాల్ కు అదనంగా 8 నుంచి 10 కేజీలు తరుగు పేరుతో కోత విధించడం సరి కాదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తేమ , తాలు పేరుతో సాకులు చెప్పి ఎక్కువ తూకం వేయించుకుంటున్నారని పేర్కొన్నారు. ఐదు రోజులుగా రామాపురంలో వరి ధాన్యం కాంటాలు వేయకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
