లక్ష్మణచాంద, వెలుగు: తమ పిల్లలను సర్కార్ బడులకే పంపుతామని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బాబాపూర్ గ్రామ ప్రజలు నిర్ణయానికి వచ్చారు. శనివారం సర్పంచ్ పడిగెల లక్ష్మి, హెచ్ఎం సుజాత ఆధ్వర్యంలో నిర్ణయించారు. గ్రామంలోకి ప్రైవేటు స్కూళ్ల బస్సులు రాకూడదని, ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, మధ్యాహ్న భోజనం, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లకు పిల్లలను పంపి ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉప్పల సురేశ్, మాజీ సర్పంచ్ తునికి నారాయణ, మాజీ ఎంపీపీ తునికి రాజేశ్వర్, గ్రామ కార్యదర్శి చందు, హెచ్ఎంలు సుజాత, కిష్టయ్య
పాల్గొన్నారు.
