లష్కర్ బోనాల జాతరకు..TGSRTC స్పెషల్ బస్సులు

లష్కర్ బోనాల జాతరకు..TGSRTC స్పెషల్ బస్సులు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వెళ్లే భక్తుల కోసం 175 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. హైదరాబాద్ లోని 24 ప్రాంతాల నుంచి సికింద్రాబాద్  ఉజ్జయిని మహంకాళి ఆలయం వరకు  ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. 

కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్  చెరు, ఈసీఐఎల్ , మెహిదీ పట్నం, దిల్  షుక్ నగర్ , కూకట్ పల్లి, చార్మినార్ , ఉప్పల్ , మల్కాజిగిరి, పాత బోయిన్ పల్లి, హకీంపేట్, మల్కాజిగిరి, నాంపల్లి తదితర ప్రాంతాల నుంచి సికింద్రా బాద్ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో  ఉంటాయి. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని  ఉపయోగించుకోవాలని  ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు బోనాల జాతర జరగనుంది.