పంజాగుట్ట, వెలుగు : మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ శుక్రవారం ప్రజావాణి కార్యక్రమానికి అతి తక్కువ ఫిర్యాదులు వచ్చాయి. రిపబ్లికే కావడంతో దూరప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య తగ్గింది. మొత్తం ఫిర్యాదుల సంఖ్య 197 కాగా.. వాటిలో ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరుతూ సింగరేణి కార్మికులు, సచివాలయంలో పనిచేసే పారిశుద్ధ కార్మికులు ఫిర్యాదులను అధికారులు అందజేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం అనేకసార్లు దరఖాస్తులు చేశామని బోరబండ సైట్3 అంబేద్కర్ నగర్ కు చెందిన కె. అమరేశ్వరి కొత్త ప్రభుత్వమైన తమకు ఇల్లు ఇవ్వాలని ఫిర్యాదు చేసింది.