
- ఏటా జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్.. సెప్టెంబర్ 17లోపు నియామకాలు
- అమరవీరుల కుటుంబాలకు రూ. 25వేల పెన్షన్
- ఏటా జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్.. సెప్టెంబర్ 17లోపు నియామకాలు
- యూత్ డిక్లరేషన్ను ప్రకటించిన కాంగ్రెస్
- యూత్ డిక్లరేషన్ను ప్రకటించిన కాంగ్రెస్
- నిరుద్యోగులకు ప్రతినెలా రూ. 4వేల భృతి
- అమరవీరుల కుటుంబాలకు రూ. 25వేల పెన్షన్.
హైదరాబాద్, వెలుగు: ఆ మధ్య వరంగల్లో రాహుల్గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్ ప్రకటించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రియాంకా సమక్షంలో హైదరాబాద్ కేంద్రంగా ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటిం చింది. అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అందులో హామీ ఇచ్చింది. యూత్ డిక్లరేషన్ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ప్రియాంకా తన ప్రసంగంలోనూ డిక్లరేషన్లోని అం శాలను ప్రస్తావించారు. డిక్లరేషన్లో ప్రకటించిన ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని, లేకపోతే అధికారం నుంచి దించేయాలని ఆమె అన్నారు.
ఇదీ యూత్ డిక్లరేషన్
l తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్య మ అమరవీరులుగా, స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించడం. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం.
వారి కుటుంబ సభ్యుల్లో తల్లి/తండ్రి/భార్యకు నెలకు రూ. 25వేల అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేయడం.
l తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, జూ న్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేయడం.
l కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఏటా జూన్ 2న జాబ్ క్యాలెండర్. సెప్టెంబర్ 17 లోపు నియామకాలు.
l నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెలా రూ.4వేలు.
l నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేసి, 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం.
l ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ, గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనకు చర్యలు.
l పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు.
l బాసరలోని రాజీవ్ గాంధీ ట్రిబుల్ ఐటీ తరహాలో కొత్తగా 4 ట్రిబుల్ ఐటీల ఏర్పాటు.
l అమెరికాలోని ఐఎంజీ అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం.
l పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్లో 2 విద్యాలయాలను ఏర్పాటు చేసి, 6వ తరగతి నుంచి పట్టభద్రులయ్యేవరకు నాణ్యమైన విద్యను అందించడం.
l 18 ఏండ్లు పైబడిన చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేయడం.