మొదటి ఏడాదే 2 లక్షల కొలువులు

మొదటి ఏడాదే 2 లక్షల కొలువులు
  • ఏటా జూన్​ 2 నాటికి జాబ్​ క్యాలెండర్​.. సెప్టెంబర్​ 17లోపు నియామకాలు
  • అమరవీరుల కుటుంబాలకు రూ. 25వేల పెన్షన్​
  • ఏటా జూన్​ 2 నాటికి జాబ్​ క్యాలెండర్​..  సెప్టెంబర్​ 17లోపు నియామకాలు
  • యూత్​ డిక్లరేషన్​ను ప్రకటించిన కాంగ్రెస్​
  • యూత్​ డిక్లరేషన్​ను ప్రకటించిన కాంగ్రెస్​
  • నిరుద్యోగులకు ప్రతినెలా రూ. 4వేల భృతి
  • అమరవీరుల కుటుంబాలకు రూ. 25వేల పెన్షన్​.

హైదరాబాద్‌‌, వెలుగు: ఆ మధ్య వరంగల్‌‌లో రాహుల్​గాంధీ సమక్షంలో  రైతు డిక్లరేషన్‌‌ ప్రకటించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రియాంకా సమక్షంలో హైదరాబాద్‌‌ కేంద్రంగా ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటిం చింది. అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అందులో హామీ ఇచ్చింది. యూత్‌‌ డిక్లరేషన్​ను పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ప్రియాంకా తన ప్రసంగంలోనూ డిక్లరేషన్‌‌లోని అం శాలను ప్రస్తావించారు. డిక్లరేషన్‌‌లో ప్రకటించిన ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని, లేకపోతే అధికారం నుంచి దించేయాలని ఆమె అన్నారు.

ఇదీ యూత్ డిక్లరేషన్

l    తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్య మ అమరవీరులుగా, స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించడం. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. 
వారి కుటుంబ సభ్యుల్లో తల్లి/తండ్రి/భార్యకు నెలకు రూ. 25వేల  అమరవీరుల గౌరవ పెన్షన్  అందజేయడం.
l    తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, జూ న్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేయడం.
l    కాంగ్రెస్‌‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఏటా జూన్​ 2న జాబ్​ క్యాలెండర్. సెప్టెంబర్​ 17 లోపు నియామకాలు.
l    నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెలా రూ.4వేలు.
l    నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్‌‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేసి, 7 జోన్లలో ఎంప్లాయ్​మెంట్ ఎక్స్చేంజ్‌‌, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం.
l    ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ, గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనకు చర్యలు.
l    పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు, ఆదిలాబాద్, ఖమ్మం,  మెదక్ జిల్లాల్లో  నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు.
l    బాసరలోని రాజీవ్ గాంధీ ట్రిబుల్‌‌ ఐటీ తరహాలో కొత్తగా 4 ట్రిబుల్‌‌ ఐటీల ఏర్పాటు.
l    అమెరికాలోని ఐఎంజీ అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం.
l    పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్​లో 2 విద్యాలయాలను ఏర్పాటు చేసి, 6వ తరగతి నుంచి పట్టభద్రులయ్యేవరకు నాణ్యమైన విద్యను అందించడం.
l    18  ఏండ్లు పైబడిన చదువుకునే  ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేయడం.