యూపీలో బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

యూపీలో బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

యూపీలో కన్నౌజ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో మంటలు చెలరేగి 20 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫరూఖాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో జైపూర్ బయల్దేరిన ప్రైవేట్ బస్సు కనౌజ్ జిల్లా చిలోయి గ్రామం దగ్గర ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. బస్సులోని 21 మందిని రక్షించిన పోలీసులు వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.