హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ ఉదయం 6 గంటల వరకు రూ.37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, మద్యం స్వాధీనం చేసుకున్నట్టు సీఈఓ ఆఫీసు గురువారం వెల్లడించింది.
ఇందులో రూ.20.43 కోట్లు నగదు కాగా.. రూ.86.92 లక్షల విలువైన మద్యం, రూ.89.02 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్టు తెలిపింది. ఇప్పటి వరకు 31 కిలోలకు పైగా బంగారం, 350 కిలోల వెండి, రూ.14.65 కోట్ల విలువైన వజ్రాలు స్వాధీనం చేసుకున్నామని, రూ.22.51 లక్షల విలువైన ల్యాప్టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.