వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌‌.. శీతల్‌‌‌‌ డబుల్ గోల్డ్

వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌‌.. శీతల్‌‌‌‌ డబుల్ గోల్డ్

బ్యాంకాక్ (థాయ్‌‌‌‌లాండ్): వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌‌‌‌లో ఇండియా  స్టార్ పారా ఆర్చర్ శీతల్ దేవి రెండు గోల్డ్ మెడల్స్‌‌‌‌ కైవసం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో ఇండియా  కాంపౌండ్ టీమ్స్‌‌ మొత్తం మూడు స్వర్ణ పతకాలను కొల్లగొట్టాయి. శుక్రవారం జరిగిన  విమెన్స్  కాంపౌండ్ టీమ్ ఫైనల్లో శీతల్ దేవి– పాయల్ నాగ్ జంట 150–-147 తో కజకిస్తాన్‌‌‌‌పై విజయం సాధించింది. 

ఆపై మిక్స్‌‌‌‌డ్ టీమ్ ఈవెంట్‌‌‌‌లో శీతల్–తోమన్ కుమార్ ద్వయం  153-–146 తో ఇండోనేసియా జంటపై గెలిచింది. మెన్స్ టీమ్ ఈవెంట్ ఫైన్లో తోమన్–శ్యామ్ సుందర్ స్వామి జోడీ 153–-146 తేడాతో చైనీస్ తైపీని ఓడించి ఇండియాకు మూడో గోల్డ్ అందించింది.