Team India Test Cricket: 1932లో ఇంగ్లాండ్ గడ్డపై తన తొలి టెస్ట్ ఆడిన భారత్, ఇప్పుడు ఏకంగా 600 టెస్టుల మైలురాయిని చేరుకుని వరల్డ్ క్రికెట్లో నెక్స్ట్ లెవెల్ డామినేషన్ చూపిస్తోంది. గాలే వేదికగా శ్రీలంకపై సాధించిన 165 పరుగుల ఘన విజయంతో ఈ 600వ టెస్టును టీమిండియా మరింత స్పెషల్గా మార్చేసింది. ఆరంభంలో ఓటములతో సతమతమైన ఇండియన్ టీమ్, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత బలమైన టెస్ట్ టీమ్గా ఎలా మారిందో ప్రతి 100వ మ్యాచ్ ఫలితాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.
ఓటములతో ఆరంభమైన మొదటి 200 టెస్టుల జర్నీ:
భారత్ ఆడిన తొలి టెస్టు (1932) అలాగే 100వ టెస్టు (1967) రెండూ ఇంగ్లాండ్ చేతిలోనే ఘోర పరాజయాలతో ముగిశాయి. లార్డ్స్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో 158 పరుగులతో ఓడిన భారత్, 35 ఏళ్ల తర్వాత బర్మింగ్హామ్లో జరిగిన 100వ మ్యాచ్లోనూ 132 రన్స్ తేడాతో డిజాస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఓడిపోయింది. ఆ తర్వాత 1982లో లాహోర్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆడిన 200వ టెస్టు మొహిందర్ అమర్నాథ్ క్లాసిక్ సెంచరీతో డ్రాగా ముగిసింది. ఇలా మొదటి 200 టెస్టుల వరకు మైలురాయి మ్యాచ్లలో భారత్కు ఒక్క విజయం కూడా దక్కలేదు.
విక్టరీ ట్రాక్ ఎక్కిన 300, 400, 500వ టెస్టులు:
300వ టెస్ట్ నుంచి కథ కంప్లీట్గా మారిపోయింది. 1996లో అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన 300వ టెస్టులో 64 పరుగుల తేడాతో నెగ్గి ఇండియా తొలిసారి మైలురాయి మ్యాచ్లో విక్టరీ కొట్టింది. ఆ తర్వాత 2006లో జమైకా వేదికగా వెస్టిండీస్పై ఆడిన 400వ టెస్టులో 49 పరుగులతో గెలిచి విదేశీ గడ్డపై జెండా పాతగా, 2016లో కాన్పూర్లో న్యూజిలాండ్తో జరిగిన 500వ టెస్టును 197 పరుగుల భారీ తేడాతో ఏకపక్షంగా క్లీన్ స్వీప్ చేసింది.
చారిత్రాత్మక 600వ టెస్టులో లంకపై భారత్ డామినేషన్:
శ్రీలంకపై సాధించిన 600వ టెస్టు విజయంతో భారత జట్టు వరుసగా నాలుగు మైలురాయి టెస్టులలో (300, 400, 500, 600) గెలిచి తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. దేవదత్ పడిక్కల్ మైండ్ బ్లాకింగ్ సెంచరీ (167), మానవ్ సుతార్ 10 వికెట్ల డెడ్లీ స్పెల్తో గాల్ టెస్టును టీమిండియా వన్ సైడెడ్గా మార్చేసింది. ఓటములతో మొదలైన ఇండియన్ టీమ్ రెడ్ -బాల్ జర్నీ, ఇప్పుడు 600వ మ్యాచ్ నాటికి ప్రపంచ క్రికెట్లో ఒక అజేయ శక్తిగా రూపాంతరం చెందడం భారత క్రికెట్ అభిమానులందరికీ నిజమైన ప్రౌడ్ మోమెంట్ అని చెప్పాలి..
