ఎలక్ట్రిక్ షాక్ తో 22 మేకలు మృతి

 ఎలక్ట్రిక్ షాక్ తో 22 మేకలు మృతి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో 22 మేకలు మృత్యువాతపడ్డాయి. సోలిపూర్ గ్రామానికి చెందిన గడ్డం ఆంజనేయులు తన మేకలను ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఉంచి.. కాపలా కోసం  గుడిసె చుట్టూ ఇనుప కంచె వేశాడు. అయితే పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం కూలి.. ఇనుప కంచెపై పడటంతో మేకలకు షాక్ కొట్టింది. ఈ ఘటనలో కరెంట్ షాక్ తో 22 మేకలు చనిపోయాయి. దాదాపు రూ. 2 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని.. తాము జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు.. తమను  ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.