తెలంగాణలో మరో 2,478 కరోనా కేసులు

తెలంగాణలో మరో 2,478 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,478 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,35,884 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 866కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,011 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,02,024గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,994 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. మరో 25,730 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 267, మేడ్చల్ 190, రంగారెడ్డి 171, నల్గొండ 135, కరీంనగర్ 129, ఖమ్మం 128, వరంగల్ అర్బన్ 95, సూర్యపేట్ 87, భద్రాద్రి 86, నిజామాబాద్ 85, కామారెడ్డి 85, సిద్ధిపేట్ 82, జగిత్యాల 79, మంచిర్యాల్ 69, పెద్దపల్లి 68, సంగారెడ్డి 67, యాదాద్రి 57, జనగాం 51, మహబూబా బాద్ 50 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

బోల్తా పడి నుజ్జునుజ్జయిన కారు.. స్పాట్‌లోనే అయిదుగురు మృతి

బ్యాడ్ బాయ్స్​కి ఫాలోయింగ్ ఎక్కువ!

వరల్డ్‌ ఓపెన్‌ చెస్‌ టైటిల్‌ సాధించిన తొలి ఇండియన్