లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన సరికొత్త ఎస్క్యూ8 మోడల్ను హైదరాబాద్ సెంట్రల్ షోరూంలో శనివారం విడుదల చేసిం ది. దీని ధర రూ.1.78 కోట్లు. ఈ కారులో 4.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది 4.1 సెకన్ల లోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎస్క్యూ8 గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఆల్ వీల్ డ్రైవ్, యాంబియంట్ లైటింగ్, 8 ఎయిర్ బ్యాగులు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
