ఏపీలో అర్చకులకు 25 శాతం వేతనం పెంపు

ఏపీలో అర్చకులకు 25 శాతం వేతనం పెంపు

ఆంధ్రప్రదేశ్ లో  దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అర్చకులకు 25 శాతం జీతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం సమగ్ర రీతిలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అర్చకుల సమస్యలపై దృష్టి సారించారు.  దీనికి సంబంధించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం చేపడుతున్నట్టు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత వేసవిలోనూ అర్చకుల జీతాన్ని పెంచింది. కేటగిరి-1 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచారు. కేటగిరీ-2 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇప్పుడు మరోసారి వారి వేతనాన్ని పెంచుతూ రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.