కైలాష్ కాలనీ స్టేషన్లో మెట్రో రైలు ముందు దూకి 25 ఏళ్ల యువకుడు జూలై 8న ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడిని అజయ్ అర్జున్ శర్మగా గుర్తించిన పోలీసులు.. ఆ వ్యక్తి కైలాష్ తూర్పు నివాసి అని, బాధితుడి మృతదేహాన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
ఈ కేసులో పోలీసులు సమాచారాన్ని క్రైం టీమ్కు అందించి సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్నారు. సీఆర్పీసీలోని సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. అంతకుముందు జూన్లో మెట్రో రైలు ముందు దూకి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కారిడార్లోని బ్లూ లైన్లోని సెక్టార్ 52 స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. మే నెలలో, ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ నగర్ జిల్లాలో నోయిడా సెక్టార్-34 మెట్రో స్టేషన్ వద్ద కదులుతున్న రైలు ముందు దూకి 32 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.