
ఏపీలోని విశాఖపట్నంలో ఘోరం జరిగింది. తల్లి వయసుండే మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఏపీలో మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో దిశ చట్టాన్నికూడా ప్రవేశపెట్టారు. అయినా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. జనవరి 2వ తేదీన 68 సంవత్సరాల వయసు గల వృద్ధురాలిపై, 27 సంవత్సరాల వయసు గల యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
For More News..