కిరాణా షాప్లో 34 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్

కిరాణా షాప్లో 34 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్

ఓ కిరాణా షాపు అడ్డాగా జరుగుతున్న గంజాయి చాక్లెట్లలకు ఎక్సైజ్ అధికారులు అధికారులు అడ్డుకట్ట వేశారు. పక్కా సమాచారంతో ఆ దుకాణంపై దాడి చేసి.. 34 కిలోల గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ఫిరోజ్ జేన అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గాంధీ నగర్ లో ఈ గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గాంధీ నగర్ లో కిరణం షాప్ నడుపుతున్న ఫిరోజ్ జేన(39) ఉప్పల్ పారిశ్రామిక వాడ పరిసర ప్రాంతాల్లో చాక్లెట్లు అమ్మూతున్నట్లు సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ ఎక్సైజ్ అధికారులు.. ఫిరోజ్ జేన కిరణం షాప్ తోపాటు అతని ఇంటిపై తనిఖీలు నిర్వహించారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని.. రిమాండ్ కు తరలించారు.