తైక్వాండోలో విజయ్‌‌ జట్టుకు 36 మెడల్స్‌‌

తైక్వాండోలో విజయ్‌‌ జట్టుకు 36 మెడల్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: కేడీఎం ఇంటర్నేషనల్‌‌ తైక్వాండో చాంపియన్‌‌షిప్‌‌లో హైదరాబాద్‌‌కు చెందిన ప్లేయర్లు సత్తా చాటారు. థాయ్‌‌లాండ్‌‌లోని బ్యాంకాక్‌‌ వేదిగా జరిగిన ఈ టోర్నీలో గ్రాండ్‌‌మాస్టర్‌‌ సోమ విజయ్ నేతృత్వంలో  బరిలోకి దిగిన జట్టు 36 మెడల్స్‌‌ సాధించింది. 

ఇందులో 7 గోల్డ్‌‌, 10 సిల్వర్‌‌, 19 బ్రాంజ్‌‌ మెడల్స్‌‌ ఉన్నాయి.  ప్రిశా పాగే గోల్డ్‌‌, రెండు సిల్వర్‌‌ మెడల్స్‌‌,  అశ్విక రాచకొండ గోల్డ్‌‌, సిల్వర్‌‌, ప్రతీక్‌‌ పాగే గోల్డ్‌‌, బ్రాంజ్‌‌, సుబ్బా రావు గోల్డ్‌‌, బ్రాంజ్‌‌ మెడల్స్‌‌తో సత్తా చాటారు.