24 గంటల్లో 37,975 కేసులు.. 480 మరణాలు

24 గంటల్లో 37,975 కేసులు.. 480 మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 37 వేల 975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 91 లక్షల 77వేల 841 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 480 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య లక్షా 34 వేల 218 కు చేరింది. నిన్న మరో 42 వేల 314 కోలుకోగా.. ఇప్పటి వరకూ 86 లక్షల 4 వేల 955 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  4 లక్షల 38 వేల 667 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 10 లక్షల 99 వేల 545 టెస్టులు చేయగా..ఇప్పటి వరకూ దేశంలో 13 కోట్ల 36 లక్షల 82 వేల 275 మంది శాంపిల్స్ పరీక్షించారు.